Nara Lokesh: ఇది జ‌గ‌న్ ఉగాది బాదుడు.. ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై లోకేశ్ విసుర్లు!

  • విద్యుత్ చార్జీల పెంపుపై లోకేశ్ ఆగ్ర‌హం
  • బాదుడే బాదుడు.. వీర‌బాదుడంటూ కామెంట్‌
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా విమర్శలతో కూడిన పోస్ట్‌
nara lokesh satires on jagan

ఏపీలో మ‌రోమారు విద్యుత్ చార్జీల‌పై విప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ఆరు సార్లు విద్యుత్ చార్జీల‌ను పెంచిన జ‌గ‌న్ స‌ర్కారు.. మ‌రోమారు విద్యుత్ చార్జీల‌ను పెంచింద‌ని ఆయా పార్టీల నేత‌లు ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ కూడా జ‌గ‌న్ స‌ర్కారు పెంచిన విద్యుత్ చార్జీల‌పై సెటైర్లు సంధించారు. 

ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టిన నారా లోకేశ్.. తాజా విద్యుత్ చార్జీల పెంపును జ‌గ‌న్ ఉగాది బాదుడుగా అభివ‌ర్ణించారు. విద్యుత్ చార్జీల పెంపుతో జ‌గ‌న్‌కే షాక్ కొట్టిన‌ట్టుగా ఉన్న ఓ ఫొటోను త‌న పోస్ట్‌కు ఆయ‌న యాడ్ చేశారు. ఇప్ప‌టికే పెట్రోల్ ఏపీలోనే అత్య‌ధిక‌మ‌న్న విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించిన లోకేశ్.. జ‌నంపై మ‌రో భారం వేస్తూ జ‌గ‌న్ స‌ర్కారు విద్యుత్ చార్జీల‌ను పెంచింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓ ప‌క్క పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. మ‌రో ప‌క్క విద్యుత్ చార్జీలు..బాదుడే బాదుడు.. వీర బాదుడు అంటూ లోకేశ్ సెటైరిక్ వ్యాఖ్య‌లు సంధించారు.

More Telugu News