Raghu Rama Krishna Raju: అందుకే ఏపీ మంత్రి బుగ్గ‌న‌ ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు: ర‌ఘురామ కృష్ణ‌రాజు

raghu rama slams ycp
  • అప్పుల కోసమే ఆరాటం
  • జ‌గ‌న్‌కు ఈ రుణదాహం ఎప్పటికి తీరుతుందో
  • వైసీపీ స‌ర్కారుకి ముందు చూపు కన్నా మందు చూపే అధికం
  • విజన్‌ అంటూ ఏమీ లేదంటూ రఘురామ విమర్శలు 
వైసీపీ నేత‌ల‌పై ఆ పార్టీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణరాజు మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు.  ఈ రోజు న్యూఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... అప్పుల కోసమే ఢిల్లీలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప‌ర్య‌టిస్తున్నార‌ని చెప్పారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఈ రుణ దాహం ఎప్పటికి తీరుతుందోనని ఎద్దేవా చేశారు. 

ఏపీలో విద్యుత్ కోతలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. వైసీపీ స‌ర్కారుకి ముందు చూపు కన్నా మందు చూపే అధిక‌మైంద‌ని చుర‌క‌లంటించారు. ఏపీ స‌ర్కారుకి అప్పులపైనే ఆలోచన ఉంద‌ని, విజన్‌ అంటూ ఏమీ లేదని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. 

Raghu Rama Krishna Raju
YSRCP
Andhra Pradesh

More Telugu News