యస్తిక అర్ధ సెంచరీ.. బంగ్లాదేశ్ ఎదుట 230 పరుగుల లక్ష్యం
- భారీ స్కోర్లు సాధించడంలో విఫలమైన భారత బ్యాటర్లు
- మరోమారు అర్ధ సెంచరీ సాధించిన యస్తిక
- గోల్డెన్ డక్గా వెనుదిరిగిన కెప్టెన్ మిథాలీ రాజ్
రిచా ఘోష్, పూజావస్త్రాకర్ కాసేపు క్రీజులో కుదురుకున్నప్పటికీ భారీ స్కోర్లు సాధించడంలో విఫలమయ్యారు. రిచా 26, పూజ 30 పరుగులు చేశారు. ఫలితంగా 50 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 229 పరుగులు మాత్రమే చేసింది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న బంగ్లాదేశ్ను భారత బౌలర్లు ఏమాత్రం నిలువరిస్తారన్న దానిపై భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తేనే భారత్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. బంగ్లా బౌలర్లలో రితు మోని 3 వికెట్లు పడగొట్టగా, నహిదా అక్తర్ రెండు వికెట్లు తీసుకుంది.