కర్ణాటకలో ఓ చేతకాని ప్రభుత్వం ఉంది: కేటీఆర్
- కర్ణాటకలో భజరంగ్ దళ్ కార్యకర్త హత్య
- దీనిపై స్పందించరా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించిన నెటిజన్
- హింస ఏ రూపంలో ఉన్నా ఖండిస్తానన్న కేటీఆర్
- బీజేపీ సర్కారు విఫలమైందని వ్యాఖ్య
హింస ఏ రూపంలో ఉన్నా ఖండించామని, ఇకపైనా అదే పంథా కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కర్ణాటకలో హింసకు పాల్పడినవారు చట్టం ముందుకు రాకతప్పదని, వారికి శిక్ష పడుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.
కర్ణాటకలో హర్ష అనే భజరంగ్ దళ్ కార్యకర్త హత్య జరగడం తెలిసిందే. దీనిపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పట్ల కేటీఆర్ పైవిధంగా స్పందించారు.