కరోనా ఎఫెక్ట్.. శ్రీలంకలో చమురు కష్టాలు
- శ్రీలంకకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు
- కరోనాతో దెబ్బతిన్న పర్యాటకం
- క్రమంగా కరిగిపోయిన విదేశీ మారక నిల్వలు
- చమురు దిగుమతి కోసం చిల్లిగవ్వ లేని వైనం
- ఒక్కొక్కటిగా మూడపడుతున్న పెట్రోల్ పంపులు
శ్రీలంకకే ఈ తరహా పరిస్థితి ఎందుకన్న విషయానికి వస్తే.. శ్రీలంక ప్రధానంగా టూరిజంపై ఆధారపడిన దేశమే. ఆ దేశంలో పెద్దగా సహజ వనరులేమీ లేవు. శ్రీలంకకు భారీ ఎత్తున పర్యాటకులు వెళుతున్నందున విదేశీ మారక నిల్వలు పెద్ద మొత్తంలోనే ఉండేవి. అయితే కరోనా కొట్టిన దెబ్బకు పర్యాటక రంగం ఛిన్నాభిన్నమైపోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా శ్రీలంక వచ్చే విదేశీ పర్యాటకులు ఒక్కసారిగా తగ్గిపోయారు. ఫలితంగా అప్పటికే అందుబాటులో ఉన్న విదేశీ మారక నిల్వలను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన శ్రీలంక.. ఇప్పుడు విదేశీ మారక నిల్వల్లో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితికి చేరుకుంది. వెరసి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురుకు చెల్లించడానికి శ్రీలంక చేతిలో పైసా కూడా లేదట.