ఏపీలో కొద్దిగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!

  • గత 24 గంటల్లో 40,357 కరోనా పరీక్షలు
  • 11,573 మందికి పాజిటివ్
  • కడప జిల్లాలో 1,942 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 1,15,425 మందికి చికిత్స
ఏపీలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా 13 వేలకు పైబడి కొత్త కేసులు నమోదవుతుండడం తెలిసిందే. గడచిన 24 గంటల్లో 40,357 శాంపిల్స్ పరీక్షించగా... 11,573 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా కడప జిల్లాలో 1,942 కేసులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో 1,522 కేసులు, గుంటూరు జిల్లాలో 1,298 కేసులు, విశాఖ జిల్లాలో 1,024 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 9,445 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,60,181 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,30,162 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,15,425 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,594కి పెరిగింది.


More Telugu News

Andhra Pradesh Corona Virus Daily Cases Today Cases