మాదాపూర్ లో కరెన్సీ నోట్లు అనుకుని ఎగబడ్డ జనం... తీరా చూస్తే...!
- రోడ్డుపై కరెన్సీ నోట్లు
- ట్రాఫిక్ కు అంతరాయం
- రంగప్రవేశం చేసిన పోలీసులు
అవన్నీ పిచ్చి నోట్లు అని గుర్తించి తీవ్ర నిరాశకు గురయ్యారు. పాపం, వాహనాలపై వెళ్లే వాళ్లు కూడా ఆ నోట్ల కోసం రావడంతో ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. అయితే, ఈ పరిస్థితిని గుర్తించిన పోలీసులు... వెంటనే ట్రాఫిక్ ను చక్కదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. జనాలను అక్కడినుంచి పంపించివేశారు. పోలీసులు ఆ నోట్లను పరిశీలించి అవి పిల్లలు ఆడుకునే పిచ్చి నోట్లు అని గుర్తించారు.