రాహుల్ రహస్య పర్యటనల సమయంలోనే దేశంలో అల్లర్లు.. మర్మమేంటో?: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
- రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై సంచలన వ్యాఖ్యలు
- గ్రాఫిక్స్ షేర్ చేసిన సంబిత్ పాత్రా
- ‘గుప్త ప్రయోగం’ చేస్తున్నారని ఆరోపణ
గత మూడేళ్లగా రాహుల్ విదేశాలకు రహస్యంగా వెళ్లి వస్తున్నారని, ఆ సమయంలోనే దేశంలో వివిధ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ట్వీట్ చేస్తూ ఇందుకు సంబంధించిన గ్రాఫిక్స్ను షేర్ చేశారు. ఇందులో ఢిల్లీ అల్లర్లు, ఎర్రకోట హింసాకాండ, ప్రధానమంత్రి భద్రతా లోపం వంటివి ఉన్నాయి. ఈ ఘటనలన్నీ రాహుల్ దేశంలో లేనప్పుడే జరిగాయని అన్నారు. 2020లో రాహుల్ రహస్య విదేశీ పర్యటన సందర్భంగా ఢిల్లీ అల్లర్లు, 2021 పర్యటన సమయంలో ఎర్రకోట అల్లర్లు, ఇప్పుడు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం వంటివి జరిగాయని అన్నారు.