Priyanka Gandhi: మా పిల్లల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు: ప్రియాంక గాంధీ

  • త్వరలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు
  • ముందస్తు దాడులు జరుగుతున్నాయన్న ప్రియాంక
  • ఈ ప్రభుత్వానికి ఇంకేం పనిలేదా అంటూ ఆగ్రహం
Priyanka Gandhi fires on Uttar Pradesh govt

కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో విపక్షాలపై ముందస్తు దాడులు జరుగుతున్నాయని అన్నారు. తమ పిల్లలు మిరాయా (18), రైహాన్ (20) ల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాకుండా వారి సోషల్ మీడియా కార్యకలాపాలపైనా ప్రభుత్వం నిఘా వేస్తోందని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఇది తప్ప ఇంకేమీ పనిలేదా? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

More Telugu News