Pavan kalyan: 'భీమ్లా నాయక్' నుంచి అడివితల్లి మాట సాంగ్!

Bheemla Nayak song released
షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ .. రానా ప్రధాన పాత్రధారులుగా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందింది. పవన్ భర్త పాత్రలో నిత్యామీనన్ నటించగా, రానా సరసన నాయికగా సంయుక్త మీనన్ కనిపించనుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి మూడు పాటలను వదలగా, మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫోర్త్ సింగిల్ ను రిలీజ్ చేశారు. 'కిందున్న మడుసులకా కోపాలు తెమలవు .. పైనున్న సామేమో కిమ్మని పలకడు. దూకేటి కత్తూలా కనికరమెరగవు .. అంటుకున్న అగ్గీలోనా ఆనవాలు మిగలవు' అంటూ ఈ పాట సాగింది. ఎమోషనల్ సీన్స్ పై కట్ చేసిన ఈ సాంగ్ జానపద బాణీలో సాగింది.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను దుర్గవ్వ - సాహితీ చాగంటి ఆలపించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, స్క్రీన్ ప్లే - సంభాషణలు త్రివిక్రమ్ అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈగో చుట్టూ అల్లుకున్న ఈ కథ ఇక్కడి ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. 
Go Back to Shorts
Pavan kalyan
Rana Daggubati
Nithya Menen
Bheemla Nayak Movie

More Telugu News