మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

Team India won the toss and opted batting
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు చివరి మ్యాచ్ జరగనుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ పోరుకు వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే 2-0తో సిరీస్ చేజిక్కించుకున్న భారత జట్టు ప్రాధాన్యం లేని ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లకు విశ్రాంతినిస్తున్నామని, ఈ మ్యాచ్ లో వారి స్థానాల్లో ఇషాన్ కిషన్, యజువేంద్ర చహల్ ఆడతారని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.

ఇక న్యూజిలాండ్ జట్టుకు ఈ మ్యాచ్ లో స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ నాయకత్వం వహించనున్నాడు. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన పేసర్ టిమ్ సౌథీ నేటి మ్యాచ్ లో ఆడడంలేదు.
Go Back to Shorts
Team India
Toss
Batting
New Zealand
Eden Gardens
Kolkata

More Telugu News