Mahesh Babu: మహేశ్, త్రివిక్రమ్ మూవీలో లావణ్య త్రిపాఠి!

Lavanya Tripathi on Mahesh movie
షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరకి 'అందాల రాక్షసి' సినిమాతో పరిచయమైన లావణ్య త్రిపాఠి, ఆ తరువాత 'భలే భలే మగాడివోయ్' .. సోగ్గాడే చిన్ని నాయనా' .. ' అర్జున్ సురవరం' వంటి హిట్ సినిమాలను చేసింది. ఇక ఈ మధ్య ఆమె నుంచి వచ్చిన 'చావుకబురు చల్లగా' సినిమా నిరాశపరిచింది. తాజాగా ఆమె మహేశ్ సరసన ఛాన్స్ కొట్టేసిందని చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం మహేశ్ బాబు .. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో ఒక కథానాయికగా పూజ హెగ్డేను ఎంపిక చేసుకున్నారు. మరో కథానాయికగా నభా నటేశ్ పేరు వినిపించింది. కానీ తాజాగా లావణ్య త్రిపాఠి పేరు తెరపైకి వచ్చింది. సెకండ్ హీరోయిన్ గా ఆమెను తీసుకున్నారని అంటున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమా డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఫస్టు షెడ్యూల్లో ఒక సోలో సాంగ్ ను .. ఒక యాక్షన్ సీన్ ను తీస్తారట.
Go Back to Shorts
Mahesh Babu
Trivikram Srinivas
Pooja Hegde
Lavanya Tripathi
Up Coming Movie

More Telugu News