పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ఎంపిక
- సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్
- ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్ పార్టీ
- ఓ ఎస్సీ నేతకు సీఎం పదవి
- చన్నీ ఎంపిక ఏకగ్రీవంగా జరిగిందన్న హరీశ్ రావత్
చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. చన్నీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయనకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వం సామాజిక న్యాయం పాటించినట్టయింది. కాగా, చన్నీ ఎంపికపై కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్ కాసేపట్లో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను కలవనున్నారు.