వరంగల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఫస్టియర్ విద్యార్థి దుస్తులు విప్పించిన సీనియర్లు

Raging in warangal KMC
  • ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన సీనియర్లు
  • యూపీ రాజకీయ కుటుంబానికి చెందిన విద్యార్థి
  • విషయం తెలిసి తల్లిదండ్రుల సీరియస్
  • క్షమాపణలు చెప్పినా శాంతించని వైనం!
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ర్యాగింగ్ మరోమారు కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ రాజకీయ కుటుంబానికి చెందిన విద్యార్థి జాతీయ కోటాలో సీటు సాధించి కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అతడి దుస్తులు విప్పించి ర్యాంగింగ్ చేసినట్టు తెలుస్తోంది.

బాధిత విద్యార్థి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఎంఈ రమేశ్‌రెడ్డి బుధవారం వరంగల్ కేసీఎంసీకి వచ్చి ర్యాగింగ్ ఘటనపై ఆరా తీశారు. ఈ విషయమై కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ మాట్లాడుతూ.. ర్యాగింగ్ చేసిన విద్యార్థులు క్షమాపణ చెప్పడంతో వివాదం సమసిపోయిందన్నారు. మరోవైపు, బాధిత విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం వారి క్షమాపణతో శాంతించలేదని సమాచారం. ప్రస్తుతం వారు వరంగల్‌లోనే ఉన్నారని తెలుస్తోంది.
Go Back to Shorts
Warangal
KMC
MBBS
Raging
Student

More Telugu News