YV Subba Reddy: టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డితో ప్ర‌మాణం చేయించిన‌ ఈవో జవహర్‌ రెడ్డి

  • శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో కార్యక్రమం
  • టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి ప్ర‌మాణం  
  • త్వరలోనే టీటీడీ బోర్డు సభ్యుల నియామ‌కం
subba reddy takes oath as ttd chairman

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డితో ఈవో జవహర్‌ రెడ్డి ప్రమాణం చేయించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్ర‌మాణం చేయ‌డం ఇది రెండోసారి. ఈ కార్యక్ర‌మానికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు హాజ‌ర‌య్యారు.

ఇక త్వరలోనే టీటీడీ బోర్డు సభ్యులను కూడా నియమించ‌నున్నారు. వైవీ సుబ్బారెడ్డి తొలిసారి 2019, జూన్‌ 21న టీటీడీ ఛైర్మ‌న్‌గా నియమితులైన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో మొత్తం 37 మంది పాలకమండలి సభ్యులను నియమించారు. జూన్‌ 21వ తేదీ నాటికి వారి ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో కొత్త పాల‌క మండలి నియామ‌క ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.  

More Telugu News