వలస వచ్చిన ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటిస్తే.. భూకబ్జాలను ఆపొచ్చు: అసోం సీఎం
- సామాజిక సమస్యలకు అధిక జనాభానే కారణమని కామెంట్
- జనాభా పెరిగితే తన ఇల్లూ కబ్జా అవుతుందన్న సీఎం
- దీనిపై ముస్లిం పార్టీలతో చర్చలకు సిద్ధమని వెల్లడి
ఇప్పటికే జనాభా నియంత్రణ చట్టాన్ని తెచ్చామని, కానీ, ముస్లిం మైనారిటీలూ జనాభాను తగ్గించుకునేందుకు కృషి చేయాలని సూచించారు. పేదరికం, భూ కబ్జాలకు కారణం జనాభా విస్ఫోటమేనన్నారు. వైష్ణవాలయాలు, సత్రాలు, అటవీ భూముల ఆక్రమణను సహించబోమన్నారు. వలసవచ్చిన ముస్లింలు అర్థం చేసుకుని జనాభాను తగ్గించుకోవాలన్నారు. దీనిపై ఏఐయూడీఎఫ్ నేత బద్రుద్దీన్ అజ్మల్, ఆల్ అసోం మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్ తోనూ మాట్లాడతానన్నారు.