అందుకే ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు: ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్
- తోడేళ్ల దాడి నుంచి తప్పించుకోవడానికే ఈటల యత్నం
- కేసీఆర్ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నారు
- ఈటల రాజేందర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసులు
తెలంగాణలోని సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 50 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, 3,311 మంది స్టాఫ్ నర్సు ఉద్యోగాల్లో 2,418 ఉద్యోగాలను మాత్రమే ఇంతవరకు భర్తీచేశారని ఆయన అన్నారు. మిగతా 893 మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా అభ్యర్థులతో టీఎస్పీఎస్సీ చెలగాటం ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.