యోగాగురు రామ్దేవ్ బాబాకు రూ.1,000 కోట్ల పరువునష్టం దావా నోటీసులు!
- అల్లోపతిని కించపరిచేలా యోగాగురు వ్యాఖ్యలు
- క్షమాపణ చెప్పాలని ఉత్తరాఖండ్ వైద్య సంఘం నోటీసులు
- 15 రోజులలో సమాధానం ఇవ్వాలని డిమాండ్
ఈ క్రమంలో, ఈ రోజు ఐఎంఏకు చెందిన ఉత్తరాఖండ్ వైద్య సంఘం రామ్దేవ్ బాబాకు రూ. వెయ్యి కోట్ల పరువునష్టం నోటీసులు ఇచ్చింది. రామ్దేవ్ తాను చేసిన వ్యాఖ్యలపై 15 రోజుల్లోగా వీడియో రూపంలో సమాధానం చెప్పాలని, అలాగే, రాతపూర్వకంగా క్షమాపణలను చెప్పాలని, లేకపోతే రూ.1000 కోట్ల పరువునష్టం కోరుతూ దావా వేయడం జరుగుతుందని స్పష్టం చేసింది.