భారీ పారితోషికం అందుకోనున్న 'ఉప్పెన' డైరెక్టర్?

  • 'ఉప్పెన'లా వచ్చిపడిన వసూళ్లు
  • నిర్మాతలకు భారీస్థాయిలో లాభాలు
  • కొత్తకథపై బుచ్చిబాబు కసరత్తు
ఇటీవల కాలంలో వచ్చిన ప్రేమకథల్లో 'ఉప్పెన' చెప్పుకోదగిన స్థాయిలో నిలిచింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. ఒక వైపున జాలరిగూడెం .. మరో వైపున సముద్రం .. ఆ మధ్యలో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఈ సినిమా నుంచి ' నీ కన్ను నీలి సముద్రం' .. 'జల జల జల పాతం నువ్వు' అనే పాటలు వదిలిన తరువాత, థియటర్లను చుట్టుముట్టే క్షణాల కోసం కుర్రాళ్లు ఎదురుచూశారు. సినిమా విడుదల కాగానే థియేటర్లను ఉక్కిరి బిక్కిరి చేశారు. ఫలితంగా ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది.

భారీస్థాయిలో లాభాలు రావడం వలన నిర్మాతలు దర్శకుడు బుచ్చిబాబుకు ఒక 'బెంజ్ కారు'ను బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు తమ బ్యానర్లో మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం బుచ్చిబాబు అందుకుంటున్న పారితోషికం 8 కోట్లు అనే టాక్ వినిపిస్తోంది. రెండవ సినిమాకే ఈ స్థాయి పారితోషికం అందుకోనున్న అతి తక్కువమంది దర్శకులలో బుచ్చిబాబు ఒకరు అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు కొత్త కథపై కసరత్తు చేస్తున్నాడట. ఇందులో హీరో హీరోయిన్లు ఎవరనేది త్వరలోనే తెలియనుంది.

Vaishnav Tej
Krithi Shetty
Vijay Sethupathi
Buchibabu

More Telugu News