ఐపీఎల్: పంజాబ్ పై టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals won the toss and opted bowling
ఐపీఎల్ లో నేడు జరిగే రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదిక కాగా, టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇప్పటివరకు చెరో రెండు మ్యాచ్ లు ఆడి ఒక విజయం సాధించాయి.

అయితే ఢిల్లీ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ జట్టులో ఓ మార్పు చేశారు. మురుగన్ అశ్విన్ స్థానంలో జలజ్ సక్సేనా తుదిజట్టులోకి వచ్చాడు. ఢిల్లీ జట్టులో టామ్ కరన్ స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టులోకి వచ్చాడు. అంతేకాదు లూక్మన్ మెరివాలా కూడా తుదిజట్టుకు ఎంపికయ్యాడు.
Go Back to Shorts
Delhi Capitals
Toss
Punjab Kings
Wankhede Stadium
Mumbai

More Telugu News