‘రాఫెల్’ను పోలిన వాహనం ఆవిష్కరణ.. ఇదిగో వీడియో
- విమానం ఎక్కలేని వారి కోసం స్పెషల్
- తయారు చేసిన బఠిండా ఆర్కిటెక్ట్
- రాఫెల్ స్ఫూర్తితో తయారు చేశానని వెల్లడి
ఆ బండికి తన పేరే పెట్టుకున్నాడు. రాం పాల్ ఎయిర్ లైన్ అని బానెట్ మీద రాయించాడు. ఫోన్ నంబర్లను రాశాడు. ఈ బండిని తయారు చేసేందుకు రూ.3 లక్షల దాకా ఖర్చు పెట్టాడట. గంటకు 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ఈ పంజాబ్ రాఫెల్ ప్రయాణిస్తుందట.
అంతేకాదు.. కొందరు పిల్లలను అందులో ఎక్కించుకుని ట్రయల్ రన్ కూడా చేశాడు. త్వరలోనే సాంస్కృతిక పార్కులో తాను తయారు చేసిన వాహనాన్ని ప్రదర్శనకు ఉంచుతానని చెప్పాడు. విమానం ఎక్కాలని ఉన్నా.. ఆర్థిక స్తోమత లేక ఆగిపోయే వారి కోసం దీనిని తయారు చేశానన్నాడు. రాఫెల్ యుద్ధ విమానాల స్ఫూర్తితో పంజాబ్ రాఫెల్ ను తయారు చేశానన్నాడు.