తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ!

srishailam goud resigns
  • కుత్బుల్లా‌పూర్  మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా
  • నేడు బీజేపీకి తీర్థం పుచ్చుకోనున్న నేత‌
  • జేపీ న‌డ్డాను క‌ల‌వడానికి ఢిల్లీకి
తెలంగాణ  కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు, కుత్బుల్లా‌పూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆ పార్టీని వీడారు. ఈ మేర‌కు కాంగ్రెస్ నేత‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై కొంత కాలంగా ఆయ‌న‌ అసంతృప్తిగా ఉన్నారు.

ఆయ‌నతో కొన్ని రోజులుగా బీజేపీ నాయ‌కురాలు డీకే అరుణ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న రాజీనామా చేసిన‌ట్లు స‌మాచారం. నిన్న సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు డీకే అరుణ ఢిల్లీ వెళ్లగా ఈ రోజు ఉదయం కూన శ్రీశైలం కూడా అక్క‌డ‌కు బయలుదేరారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా శ్రీశైలం గౌడ్‌ రాజీనామా చేశారు.  ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని చెప్పారు.


Go Back to Shorts
srishailam goud
Congress
BJP
Telangana

More Telugu News