బెంగాల్ ను సర్వనాశనం చేస్తున్న మమతా బెనర్జీ: నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు
- ఎన్నికల శంఖారావాన్ని పూరించిన మోదీ
- మమత పాలనలో అభివృద్ధి పూజ్యం
- ప్రజలు మమతకు శుభం కార్డు వేయాల్సిందే
- వామపక్షాలు మళ్లీ బలం పుంజుకున్నాయన్న మోదీ
కేంద్ర బడ్జెట్ లో బెంగాల్ కు అన్ని విధాలుగా న్యాయం చేశామని నరేంద్ర మోదీ వెల్లడించారు. మమత పాలనపై రాష్ట్ర ప్రజలు చాలా నిరాశగా ఉన్నారని, వారు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. కేంద్ర పథకాలను ఆమె ప్రజలకు దగ్గర చేయడం లేదని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో పాలకుల దుర్మార్గం, హింస, అవినీతి పెరిగిపోయాయని మోదీ విమర్శించారు. 'భారత్ మాతాకీ జై' అని నినదించినా, హక్కుల గురించి అడిగినా, తీవ్ర అసహనానికి గురయ్యే వారు ప్రజలకు సుపరిపాలనను ఎలా అందించగలరని ప్రశ్నించారు.
మమతా బెనర్జీ నేతృత్వంలో వామపక్షాలు మళ్లీ బలం పుంజుకున్నాయని ఆరోపించారు. ఈ సిండికేట్ బ్యాచ్ మరికొన్ని రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తరువాత రాష్ట్రంలో కచ్చితంగా మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు. నందిగ్రామ్ వేదికగా నానా హంగామా సృష్టించిన వారిని ముఖ్యమంత్రి మమత ఎందుకు తన పార్టీలోకి తీసుకున్నారో ప్రజలు అడగాలని అన్నారు. రాష్ట్ర పరిస్థితి ఇంతగా దిగజారిందంటే అది మమతా బెనర్జీ రాజకీయమేనని ఆరోపించారు.