కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్ కలకలం... ఒకరి మృతి
- దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి
- కేరళలో కొత్త రకం ఇన్ఫెక్షన్
- పేగులను దెబ్బతీసే షిగెల్లా బ్యాక్టీరియా
- కోజికోడ్ జిల్లాలో 40 కేసులు
- పరిస్థితి అదుపులోనే ఉందన్న జిల్లా వైద్యాధికారి
షిగెల్లా అనే బ్యాక్టీరియా కారణంగా పేగుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. దీని ప్రధాన లక్షణాలు డయేరియా, తరచుగా మలంలో రక్తం, బంక కనిపిస్తాయి. కడుపు నొప్పితో పాటు జ్వరం కూడా వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కు గురైన వ్యక్తిలో వారం రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్ల లోపు పిల్లలతో పాటు, కొన్ని సార్లు పెద్దలకు కూడా ఇది ప్రాణాంతకం అవుతుంది. అమెరికాలోనూ షిగెల్లా కేసులు పెద్ద సంఖ్యలో వస్తుంటాయి. అగ్రరాజ్యంలో ఏటా 5 లక్షల మంది ఈ ప్రమాదకర ఇన్ఫెక్షన్ బారినపడుతుంటారట.