అద్భుతంగా రాణించి భారత్ను గెలిపించిన పాండ్యా, జడేజాపై గంగూలీ ప్రశంసలు
- భారత జట్టులో వారిద్దరు కీలకమైన ఆటగాళ్లుగా అవతరిస్తారు
- సిరీస్ ఓడిపోయినప్పటికీ మూడో మ్యాచులో భారత్కు మంచి విజయం
- ఈ విజయంతోనైనా పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నా
వారి ఆటతీరుపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ... భారత జట్టులో వారిద్దరు దీర్ఘ కాలంలో కీలకమైన ఆటగాళ్లుగా అవతరిస్తారని తెలిపారు. సిరీస్ ఓడిపోయినప్పటికీ మూడో మ్యాచు రూపంలో భారత్కు మంచి విజయం దక్కిందని అన్నారు. ఇది సుదీర్ఘ పర్యటన కావడంతో ఈ విజయంతోనైనా పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. రెండు వన్డేల్లో ఆసీస్కు తగ్గట్లుగా రాణించని భారత్ మూడో వన్డేలో గెలవడంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్లో భారత్ గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. దీని తర్వాత ఆసీస్తో భారత్ టెస్టు సిరీస్ కూడా ఆడనుంది.