బంగాళాఖాతంలో 'బురేవి'... తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం

Deep Depression in Bay Of Bengal intensified into Cyclone Burevi
  • ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను
  • రేపు సాయంత్రం ట్రింకోమలీ తీరాన్ని దాటనున్న బురేవి
  • డిసెంబరు 3న మన్నార్ సింధుశాఖలో ప్రవేశం
ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానును బురేవిగా పిలవనున్నారు. ప్రస్తుతం ఈ తుపాను శ్రీలంకలోని ట్రింకోమలీ తీరానికి తూర్పు, ఆగ్నేయ దిశగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. బురేవి డిసెంబరు 2 సాయంత్రం తర్వాత ట్రింకోమలీ రేవు పట్టణం సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. డిసెంబరు 3 ఉదయం మన్నార్ సింధుశాఖలో ప్రవేశించి దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకుతుందని వివరించింది. దీని ప్రభావంతో తమిళనాడు, కేరళ, దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఇంతకుముందు ప్రకటించారు.
Go Back to Shorts
Burevi
Cyclone
Deep Depression
Bay Of Bengal
Sri Lanka
Tamilnadu

More Telugu News