Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమావేశం

Kishan Reddy and Lakshman met Pawan Kalyan
షార్ట్స్‌లో చూడండి
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఈ మధ్యాహ్నం  జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేన... బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపుతుండగా, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మాత్రం తమకు ఎవరితోనూ పొత్తు లేదని నిన్న స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్, బండి సంజయ్ చర్చలు జరుపుతారని జనసేన పార్టీ ప్రకటన చేయడంతో పొత్తు విషయంలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Go Back to Shorts
Pawan Kalyan
Kishan Reddy
Lakshman
BJP
Janasena
GHMC Elections
Hyderabad

More Telugu News