తేజస్వికి అధికారం అప్పగించి ఉంటే.. దానిని ఆయన తన తండ్రికి బదలాయించేవాడు: ఉమాభారతి
- తేజస్వి, కమల్నాథ్లపై ఉమాభారతి ప్రశంసలు
- తేజస్వి చాలా మంచి కుర్రాడని కితాబు
- కమల్నాథ్ వ్యూహాత్మకంగా పోరాడారన్న ఫైర్బ్రాండ్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ను కూడా ఉమాభారతి ప్రశంసించారు. ఈ ఎన్నికల్లో కమల్నాథ్ వ్యూహాత్మకంగా పోరాడారని అన్నారు. కమల్నాథ్ తనకు అన్నయ్యలాంటి వారని, చాలా మంచి వ్యక్తి అని కొనియాడారు. ప్రభుత్వాన్ని ఆయన సమర్థంగా నడిపించి ఉంటే ఈ సమస్యలు వచ్చి ఉండేవి కావని ఉమాభారతి అన్నారు. కాగా, మధ్యప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 9 చోట్ల విజయం సాధించగా, 19 స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా శివరాజ్సింగ్ ప్రభుత్వానికి ఢోకా లేకుండా పోయింది.