బ్రిటన్ ప్రధాని నోట రాముడు, సీత, రావణ సంహారం మాట!
- బోరిస్ జాన్సన్ దీపావళి సందేశం
- బ్రిటన్ లోని హిందువులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
- చీకటిపై వెలుగుదే విజయం అంటూ వ్యాఖ్యలు
మున్ముందు భారీ సవాళ్లు ఎదురవుతాయనడంలో సందేహంలేదని, అయితే వాటిని తాము అధిగమించగలమన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరిపైనా తనకు విశ్వాసం ఉందని, అందరం కలిసికట్టుగా కృషి చేస్తే వైరస్ మహమ్మారిని జయించగలమని అన్నారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం విజయం సాధిస్తాయని దీపావళి చాటుతోందని పేర్కొన్నారు.
"శ్రీరాముడు, ఆయన భార్య సీతాదేవి రాక్షసరాజు రావణుడ్ని సంహరించాక తిరిగి వచ్చే క్రమంలో వారు ప్రయాణించిన మార్గం అంతా కోట్లాది దీపాలతో వెలిగిపోయింది. మనం కూడా దీన్నే స్ఫూర్తిగా తీసుకుందాం. కరోనా వైరస్ ను ఓడిద్దాం. ఆపై అంతా వెలుగులే" అని వివరించారు.
అయితే హిందువులు ఈసారి దీపావళిని కరోనా నిబంధనల మధ్య జరుపుకోవాల్సి రావడం విచారకరమని, బంధుమిత్రులందరూ ఒక్కచోట గుమికూడి సమోసాలు, గులాబ్ జామూన్ లు తింటూ దీపావళి పండుగ జరుపుకోవడం కష్టమేనని బోరిస్ జాన్సన్ అన్నారు.