దివ్యాంగుడికి త్రిచక్ర వాహనం కోసం తన జీతం నుంచి డబ్బులు ఇచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి

Telangana Minister Niranjan Reddy helps a handicapped person
  • వనపర్తి జిల్లాలో దివ్యాంగుడికి మంత్రి సాయం
  • తన జీతం నుంచి రూ.30 వేలు ఇచ్చిన నిరంజన్ రెడ్డి
  • త్రిచక్ర వాహనం కొనుక్కున్న దివ్యాంగుడు
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పెద్దమనసు చాటుకున్నారు. ఓ దివ్యాంగుడి కుటుంబ పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన ఆయన తన జీతం డబ్బులు ఇచ్చారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లికి చెందిన కృష్ణయ్య ఓ దివ్యాంగుడు. ఆయనకు భార్య భారతమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కాల్షియం లోపం కారణంగా యువకుడిగా ఉన్నప్పుడు కృష్ణయ్య కాళ్లకు వైకల్యం సోకింది.

ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేలా ఓ త్రిచక్ర వాహనం కొనుగోలు కోసం మంత్రి నిరంజన్ రెడ్డి తన జీతం నుంచి రూ.30 వేలు అందించారు. అంతేకాదు, కృష్ణయ్య నూతన త్రిచక్రవాహనంపై కూర్చుండగా, అతడి కుమార్తె నడుపుతున్న దృశ్యాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకల్యం అనేది మనుషులకేనని, మనసులకు కాదని, దివ్యాంగులు కూడా ఎవరికీ తక్కువ కాదని, వారిలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా ప్రోత్సహించాలని అన్నారు.
Go Back to Shorts
Singireddy Niranjan Reddy
Tri Scooter
Handicapped
Vanaparti

More Telugu News