వరద నీటిలో కొట్టుకుపోయిన కిలోన్నర బంగారు నగలు!
- హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఘటన
- రాత్రి పొద్దుపోయేంత వరకు వెతికినా ఫలితం శూన్యం
- సేల్స్మన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
అప్పటికే వర్షం కురుస్తున్నప్పటికీ బంజారాహిల్స్ రోడ్డు నంబరు 3 మీదుగా బయలుదేరాడు. ఈ క్రమంలో స్థానిక కిడ్స్ స్కూలు వద్ద వరద రావడంతో అందులో ఆభరణాల సంచి కొట్టుకుపోయింది. వెంటనే సమాచారం అందుకున్న దుకాణ యజమానితోపాటు మరో 15 మంది అక్కడకు చేరుకుని రాత్రి పొద్దుపోయేంత వరకు వెతికారు. చివరికి బ్యాగు దొరికినా అందులోని నగలు కనిపించకపోవడంతో హతాశులయ్యారు. దుకాణ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సేల్స్మన్ ప్రదీప్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.