అత్యాచారం జరిగితే జాతీయ అత్యయిక పరిస్థితే... లైబీరియా ప్రభుత్వం నిర్ణయం!
- దేశ రాజధాని మన్రోవియాలో విపరీతంగా పెరిగిన అత్యాచారాలు
- దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలు
- అత్యాచారాల నిరోధానికి సరికొత్త చర్యలు ప్రకటించిన అధ్యక్షుడు
దీంతో స్పందించిన అధ్యక్షుడు తాజా ప్రకటన చేశారు. అత్యాచారాలను దేశ అత్యవసర స్థితిగా ప్రకటించిన జార్జ్ వీ.. వాటిని అరికట్టేందుకు సరికొత్త చర్యలు ప్రకటించారు. అలాగే, ఈ కేసులను విచారించేందుకు ప్రత్యేక ప్రాసిక్యూటర్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు జాతీయ లైంగిక నేరస్తుల జాబితాను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, లైంగిక, లింగ ఆధారిత హింసపై జాతీయ భద్రతా టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు అధ్యక్షుడు జార్జ్ వీ ప్రకటించారు.