గోనెసంచిలో వృద్ధురాలి మృతదేహం... బంజారాహిల్స్ లో కలకలం!
- దుప్పటిలో చుట్టి ఉన్న మృతదేహం
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
- సీసీ టీవీ కెమెరా ఫుటేజి పరిశీలించనున్న పోలీసులు
ఆ మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి, గోనెసంచిలో ఉంచి అక్కడ ఎవరో వదిలి వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ కరోనాతో చనిపోతే ఆ విధంగా వదిలేసి వెళ్లారేమో అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ టీవీ కెమెరా ఫుటేజిని పరిశీలిస్తే ఏమైనా ఆధారాలు లభ్యం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని బంజారాహిల్స్ పోలీసులు అంటున్నారు.