Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్: 24 గంటల్లో 93 మంది మృత్యువాత

Ninety three persons dies of corona in AP within twenty four hours
  • 3,282కి పెరిగిన కరోనా మరణాలు
  • కొత్తగా 7,895 పాజిటివ్ కేసులు
  • 7,449 మందికి కరోనా నయం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభణకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేట్టు కనిపించడంలేదు. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 93 మంది మరణించారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 16 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, చిత్తూరు జిల్లాలో 11 మంది, కర్నూలు జిల్లాలో 10 మంది మృతి చెందారు. ఈ క్రమంలో మొత్తం మరణాల సంఖ్య 3,282కి పెరిగింది.

ఇక, కొత్తగా 7,895 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 1,256 కేసులు గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,53,111కి చేరగా, తాజాగా 7,449 మంది కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు 2,60,087 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 89,742 మంది చికిత్స పొందుతున్నారు.
Andhra Pradesh
Corona Virus
Deaths
Positive Cases
COVID-19

More Telugu News