భారత్‌లోకి చొర‌బడడానికి యత్నించిన ఐదుగురిని హ‌తమార్చిన జవాన్లు

BSF kills 5 intruders along India Pak IB in Punjab
  • పంజాబ్‌లోని భార‌త్‌-పాకిస్థాన్ స‌రిహ‌ద్దు వద్ద ఘటన
  • ఉదయం 4.45 గంట‌ల‌కు కాల్పులు
  • అనుమానాస్పద కదలికలతో నిన్న రాత్రి నుంచి గస్తీ 
పంజాబ్‌లోని భార‌త్‌-పాకిస్థాన్ స‌రిహ‌ద్దు మీదుగా దేశంలోకి చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురిని బీఎస్‌ఎఫ్ బలగాలు హతమార్చాయి. ఈ రోజు ఉదయం 4.45 గంట‌ల‌కు పంజాబ్‌లోని తార్న్ తార‌న్ జిల్లా ఖెమ్‌క‌ర‌న్ బార్డ‌ర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదుగురు వ్యక్తులు అక్కడి ప్రాంతంలో కనపడడంతో వారిని లొంగిపోవాలని బీఎస్ఎఫ్‌ జవాన్లు హెచ్చరించారు.

దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలపై ఆ ఐదుగురు చొరబాటుదారులు కాల్పులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో వారిపై కాల్పులు జరిపి వారందరినీ బీఎస్‌ఎఫ్ జవాన్లు హతమార్చారు. సరిహద్దుల వద్ద అనుమానాస్పద కదలికలు ఉండడంతో నిన్న రాత్రి నుంచి గస్తీ పెంచినట్లు అధికారులు వివరించారు.

Go Back to Shorts
bsf
India
Pakistan
punjab

More Telugu News