Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్: ఒక్కరోజులో 91 మంది మృతి, 9,544 కొత్త కేసులు

AP witnessed thousands of corona positive cases
  • చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16 మంది మృతి
  • 3,092కి పెరిగిన మొత్తం మరణాల సంఖ్య
  • తాజాగా 8,827 మందికి కరోనా నయం
ఏపీలో గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా మరణాలు, పాజిటివ్ కేసులకు సంబంధించిన బులెటిన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కొత్తగా 9,544 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా, అదే సమయంలో 91 మంది వైరస్ మహమ్మారికి బలయ్యారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16 మంది మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, నెల్లూరు జిల్లాలో 12 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిరకు కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 3,092కి పెరిగింది.

కాగా, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తాజాగా వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు. ప్రస్తుతం 87,803 మంది చికిత్స పొందుతుండగా, మరో 8,827 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,34,940 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,44,045 మంది కోలుకున్నారు.
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Deaths
COVID-19

More Telugu News