Jagananna Cheyutha: ఏపీ మహిళలకు శుభవార్త.. రేపే 'జగనన్న చేయూత' ప్రారంభం

Jagananna Cheyutha scheme to be launched tomorrow
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'జగనన్న చేయూత' పథకం రేపు ప్రారంభం కానుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు లబ్ధి చేకూరనుంది. వీరందరికీ ప్రతి ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్లలో రూ. 75 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ పథకం ద్వారా 24 లక్షల నుంచి 25 లక్షల మంది పేద మహిళలు లబ్ధి పొందనున్నారు. నాలుగేళ్లకు గాను ఈ పథకానికి సుమారు రూ. 20 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. ఈ ఏడాదికి రూ. 4,700 కోట్లు కేటాయించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు.
Go Back to Shorts
Jagananna Cheyutha
Jagan
YSRCP

More Telugu News