Corona Virus: ఏపీలో కొత్తగా 10,376 పాజిటివ్ కేసుల నమోదు!

  • మరో 68 మంది మృతి
  • మొత్తం కేసుల సంఖ్య 1,40,933 
  • గత 24 గంటల్లో 3,822 డిశ్చార్జి
Once again thousands of corona positive cases emerged in AP

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ ఎక్కువ అవుతుండడమే కాదు, గత కొన్నిరోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరణాలు నమోదువుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. తాజగా ఏపీలో 10,376 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే ప్రథమం. మొత్తం కేసుల సంఖ్య 1,40,933కి చేరింది.

అటు, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 68 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13 మంది చనిపోయారు. ఓవరాల్ గా చూస్తే రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,349కి పెరిగింది. కొత్తగా 3,822 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ఇంకా 75,720 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News