Telangana: హైదరాబాద్‌లో తగ్గుతూ.. జిల్లాల్లో పెరుగుతున్న కేసులు.. బులెటిన్ విడుదల చేసిన ప్రభుత్వం

Corona positive cases crossed 57 thousand in Telangana
  • నిన్న మొత్తం 1610 కేసులు నమోదు, 9 మంది మృతి
  • రాష్ట్రంలో 57 వేలు దాటేసిన కేసులు
  • ఇప్పటి వరకు 3,79,081 మందికి కరోనా పరీక్షలు
తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతికి అడ్డుకట్ట పడడం లేదు. నిన్న కొత్తగా మరో 1610 మంది కరోనా బారినపడినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. అలాగే, నిన్న 9 మంది కరోనాతో మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 480కి చేరుకోగా, మొత్తం కేసుల సంఖ్య 57,142కు పెరిగింది.

కరోనా నుంచి నిన్న 803 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 42,909కి పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 13,753 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక నిన్న నమోదైన మొత్తం కేసుల్లో 531 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. ఆ తర్వాత అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 340, రంగారెడ్డి జిల్లాలో 172, వరంగల్ అర్బన్ 152, మేడ్చల్ మల్కాజిగిరిలో 113, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో 48 చొప్పున, సూర్యాపేటలో 35, ములుగులో 32, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 26 చొప్పున,  మహబూబ్‌నగర్‌లో 23 కేసులు నమోదయ్యాయి. అలాగే, ఇప్పటి వరకు 3,79,081 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇంకా 809 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.
.
Telangana
Corona Virus
Warangal Urban District
Jogulamba Gadwal District

More Telugu News