కశ్మీర్ బీజేపీ చీఫ్ కు కరోనా... ఆయనను కలిసిన జితేంద్ర సింగ్, రామ్ మాధవ్ క్వారంటైన్
- రాజకీయ రంగంలో కరోనా కల్లోలం
- జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీంద్ర రైనాకు పాజిటివ్
- రైనాతో ప్రయాణించానన్న జితేంద్ర సింగ్
- రెండ్రోజుల కిందట రైనాను కలిశానన్న రామ్ మాధవ్
జూలై 12న శ్రీనగర్ నుంచి బందిపొరా వరకు రవీంద్ర రైనాతో ప్రయాణించామని జితేంద్ర సింగ్ తెలిపారు. రెండ్రోజుల క్రితం రవీంద్ర రైనాతో కలిసి శ్రీనగర్ లో వున్నానని రామ్ మాధవ్ పేర్కొన్నారు. గడచిన 2 వారాల్లో 4 సార్లు టెస్టు చేయించుకున్నానని, నెగెటివ్ వచ్చిందని వివరించారు. అయితే, తన, ఇతరుల ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్తగా ఈసారి క్వారంటైన్ లోకి వెళుతున్నానని రామ్ మాధవ్ వెల్లడించారు.