Umabharathi: రాహుల్ అసూయ వల్లే కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది: ఉమాభారతి

రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బీజేపీ మహిళా నేత ఉమాభారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఆ పార్టీలోని యువనేతలంటే అసూయ అని అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారడానికి కారణం రాహులేనని ఆరోపించారు. ముఖ్యంగా జ్యోతిరాదిత్య సింథియా, సచిన్ పైలెట్ అంటే రాహుల్ కు అసూయ అని తెలిపారు. యువనేతలకు అవకాశం ఇస్తే తాను మరుగున పడిపోతానని రాహుల్ భావిస్తుంటాడని వివరించారు. సింథియా, పైలెట్ లను తాను మేనల్లుళ్లుగా భావిస్తానని, పైలెట్ కూడా బీజేపీలోకి వస్తానంటే సంతోషిస్తానని తెలిపారు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ పై సచిన్ పైలెట్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడక్కడ బలాబలాల అంశం కీలకంగా మారింది.
Umabharathi
Rahul Gandhi
Jyotiradithya Scindia
Sachin Pilot
Congress
BJP
Rajasthan

More Telugu News