పాట్నా ఎయిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్... 18 మంది వలంటీర్లను ఎంపిక చేసిన ఐసీఎంఆర్
- కోవాగ్జిన్ పేరుతో కరోనా వ్యాక్సిన్ తయారుచేసిన భారత్ బయోటెక్
- క్లినికల్ ట్రయల్స్ కు ఏర్పాట్లు
- 12 వైద్య సంస్థలను ఎంపిక చేసిన ఐసీఎంఆర్
ఈ వలంటీర్లకు వ్యాక్సిన్ తొలిడోసు ఇచ్చిన తర్వాత రెండు మూడు గంటల పాటు పరిశీలనలో ఉంచుతారు. క్లినికల్ ట్రయల్ పూర్తవ్వాలంటే మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా 12 వైద్య సంస్థలను ఎంపిక చేసింది. వాటిలో పాట్నా ఎయిమ్స్ ఒకటి. హైదరాబాదులోని నిమ్స్ వైద్య సంస్థ కూడా క్లినికల్స్ ట్రయల్స్ కు ఎంపికైంది.