బీహార్ లో మళ్లీ పిడుగుల బీభత్సం... 23 మంది బలి
- ఐదు జిల్లాల్లో పిడుగుపాటు
- అత్యధికంగా భోజ్ పూర్ జిల్లాలో 9 మంది మృతి
- ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి
కాగా, బీహార్ లో ప్రస్తుత పరిస్థితికి వాతావరణ మార్పులే కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, మరోవైపు దక్షిణాది నుంచి బంగాళాఖాతం మీదుగా తేమతో కూడిన గాలులు వీస్తున్నాయని, వీటి కలయిక వల్లే పిడుగులు పడడం వంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని వివరించారు. గత పక్షం రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 150 మంది వరకు మరణించారు.