Pawan Kalyan: నాలుగు నెలల పాటు ఒక్కపూటే భోజనం... చాతుర్మాస దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్!

  • క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజలు
  • ఇబ్బందులు తొలగాలని దీక్ష
  • నాలుగు నెలలు సాగనున్న దీక్ష
Pawan Started 4 Months Deeksha

ప్రజా సంక్షేమం కోరుతూ జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ చాతుర్మాస దీక్షను ప్రారంభించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు కాపాడబడాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా, భగవంతుడిని ప్రార్థిస్తూ, నాలుగు నెలల పాటు దీక్షను చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ నాలుగు నెలలూ ఆయన ఏకభుక్తంగానే ఉంటారు. అంటే ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తారు. ఈ దీక్షను పూర్తి చేసే క్రమంలో నిత్యమూ నియమబద్ధ జీవితాన్ని గడపనున్నారు. కాగా, ప్రస్తుతం 'వకీల్ సాబ్' చిత్రంలో నటిస్తున్న ఆయన, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులు అనుకూలిస్తే, తిరిగి సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం

More Telugu News