Corona Virus: ఏపీలో మరో 135 మందికి సోకిన కరోనా

coronavirus cases in ap
  • గత 24 గంటల్లో 11,602 శాంపిళ్ల పరీక్ష 
  • మొత్తం కరోనా కేసులు 4,261
  • ఆసుపత్రుల్లో 1,641 మందికి చికిత్స
  • మృతుల సంఖ్య మొత్తం 80
ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌-19 కేసులు మరిన్ని పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 11,602 శాంపిళ్లను పరీక్షించగా మరో 135 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 65 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 4,261 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 1,641 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,540 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 80కి చేరింది.
          
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News