India: ఇదేనా మీరు చెబుతున్న చైనా ఆక్రమణలోని ఇండియా?: ఫొటోలు పోస్ట్ చేసిన లడక్ ఎంపీ 

Ladak MP Strong Reply to Rahul Gandhi
షార్ట్స్‌లో చూడండి
లడక్ లో భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించిందా? అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వేళ, ఇదేనా మీరు చెబుతున్న చైనా ఆక్రమణలోని ఇండియా? అంటూ లడక్ ఎంపీ, బీజేపీ నేత జామ్ యాంగ్ ట్రెన్సింగ్ నామ్ గోయల్ కొన్ని చిత్రాలను ఈ ఉదయం పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన, ఇప్పటికైనా ఆయన, కాంగ్రెస్ పార్టీ తన సమాధానాన్ని స్వీకరించి, మరోసారి ప్రజలను తప్పుదారి పట్టించే పని చేయబోరని ఆశిస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. "ఇండియాలోని ప్రాంతాలను చైనా ఆక్రమించిందని రాహుల్ గాంధీ అంటున్నారు. అవును... అది ఇదే మీరూ చూడండి" అని నామ్ గోయల్ సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ హయాంలోనే లడక్ లోని ప్రాంతాలను చైనా ఆక్రమించిందంటూ ఆయన మండిపడ్డారు. 1962లో ఆక్సాయ్ చిన్ లో 37,244 చదరపు కిలోమీటర్ల దూరం ఆక్రమణకు గురైందని, చుముర్ ప్రాంతంలో 2008లో 250 మీటర్ల మేరకు చైనా ఆక్రమించిందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో డెమ్ జోక్ ప్రాంతంలోని జొరావర్ కోటను ధ్వంసం చేశారని, అక్కడ 2012లో యూపీఏ హయాంలోనే పీపుల్స్ చైనా ఆర్మీ 13 గృహాలను నిర్మించిందని అన్నారు. 2009లో డెమజోక్, డుంగ్టీ మధ్యలో ఉన్న డూమ్ లోయను భారత్ కోల్పోయిందని గుర్తు చేశారు.
Go Back to Shorts
India
China
Ladak
MP
Border

More Telugu News