సింగరేణి గనుల్లో తీవ్ర విషాదం... భారీ పేలుడుతో ఐదుగురి మృతి
- బ్లాస్టింగ్ సందర్భంగా ప్రమాదం
- ముడిపదార్థాలు నింపుతుండగా విస్ఫోటనం
- ఛిద్రమైన కార్మికుల శరీరాలు
బ్లాస్టింగ్ కు అవసరమైన ముడిపదార్థాలు నింపుతున్న సమయంలో ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. పేలుడు ధాటికి సంఘటన స్థలంలో బీభత్సం నెలకొంది. ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వారి దేహాలు ఛిద్రం అయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.