Telangana: తెలంగాణలో కరోనా కల్లోలం... 24 గంటల్లో 199 కేసులు

Telangana gets more corona positive cases
  • స్థానికంగా 196 మందికి కరోనా
  • బయటి నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్
  • గడచిన 24 గంటల్లో ఐదుగురి మృతి
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ మరింత తీవ్రమైంది. ఇవాళ ఒక్కరోజే 199 కొత్త కేసులు వెల్లడయ్యాయి. స్థానికంగా 196 మందికి కరోనా నిర్ధారణ కాగా, బయటి నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో ముగ్గురికి కరోనా సోకినట్టు తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి భారీగా కేసులు వెలుగు చూశాయి. ఏకంగా 122 మంది కరోనా బారిన పడినట్టు గుర్తించారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 40 పాజిటివ్ కేసులు తేలాయి. గత కొన్ని వారాలుగా కరోనా కేసులు చూడని జిల్లాల్లోనూ ఈసారి కేసులు రావడం తెలంగాణ యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇక, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,698కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,188 మంది చికిత్స పొందుతున్నారు. మరణించిన వారి సంఖ్య 82 అని బులెటిన్ లో పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో 5 మరణాలు సంభవించాయి.
Telangana
Corona Virus
Positive Cases
Deaths
COVID-19

More Telugu News