చిన్న కేసులకు కూడా సీబీఐ విచారణా?: వైసీపీ నేత ఆమంచి తీవ్ర వ్యాఖ్యలు
- డాక్టర్ సుధాకర్ ది ఒక పెట్టీ కేసు
- కేసును సీబీఐకి అప్పగించడంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి
- ఇలాంటి తీర్పులతో న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుంది
సుధాకర్ ది ఒక పెట్టీ కేసు అని... దీనిపై సీబీఐ విచారణ వేయడంతో రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమంచి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును విచారించడానికి రాష్ట్రంలో ఒక్క నీజాయతీ కలిగిన అధికారి కూడా హైకోర్టుకు కనిపించలేదా? అని ప్రశ్నించారు. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదనే విషయం తనకు తెలుసని... కానీ, ఇలాంటి తీర్పులతో ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని అన్నారు. వైసీపీ గెలిచి ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించిన వేడుకల సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.