Corona Virus: కరోనా అప్ డేట్: 213 దేశాలకు పాకిన కరోనా... 47 లక్షల మందికి పాజిటివ్

World corona virus updates
  • ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా మృతి
  • కరోనా నుంచి కోలుకున్న 18 లక్షల మంది
  • అమెరికాలో అత్యధిక మరణాలు
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు పాకినట్టు గుర్తించారు. ఇప్పటివరకు 47,17,038 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 3,12,384 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద చికిత్స పొందుతున్న వారి సంఖ్య 25,94,555. ఇక, 18,10,099 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అత్యధికంగా అమెరికాలో ఈ వైరస్ ధాటికి 89,595 మంది మరణించారు. గత 24 గంటల్లోనే అక్కడ వెయ్యికి పైగా మృతి చెందారు. ఇతర దేశాల్లోనూ కరోనా కారణంగా భారీ సంఖ్యలో కన్నుమూశారు.

కరోనాతో ఏ దేశంలో ఎంతమంది మరణించారంటే...

  • యూకే-34,466
  • ఇటలీ-31,763
  • ఫ్రాన్స్-27,625
  • స్పెయిన్-27,563
  • బ్రెజిల్-15,633
  • బెల్జియం-9,005
  • జర్మనీ-8,027
  • ఇరాన్-6,937
  • కెనడా-5,679
  • నెదర్లాండ్స్-5,670
  • మెక్సికో-4,767
  • చైనా-4,633
  • టర్కీ-4,096
  • స్వీడన్-3,674
  • భారత్-2,871
  • ఈక్వెడార్-2,688
  • రష్యా-2,537
  • పెరూ-2,523
  • స్విట్జర్లాండ్-1,879
  • ఐర్లాండ్-1,533
  • పోర్చుగల్-1,203
  • రుమేనియా-1,094
  • ఇండోనేషియా-1,089






Corona Virus
World
Updates
Positive Cases
Deaths
USA
China

More Telugu News